అత్యంత చాకచక్యంగా గంజాయి అక్రమ రవాణా కు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కృష్ణ దేవి పేట పోలీస్ స్టేషన్ పరిధి, భీమవరం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్., గారు ప్రశంసించి, నగదు రివార్డులు అందజేశారు.
కేడీపేట పోలీసులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను మరియు 25 కేజీలు గంజాయిని అక్రమంగా తరలిస్తు ఉండగా, (రెండు మూటలు), రూ.11,06,000/- నగదును, ఒక కారు మరియు మూడు మొబైల్ లు పట్టుకుని కేసు నమోదు చేశారు.
కర్ణాటక చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక కారులో రూ.12 లక్షల 50 వేలు నగదుతో ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి గంజాయి కొందామని ప్రయత్నించి పోలీసులు నిఘా ఎక్కువ ఉండడంతో ఎక్కువ మోతాదులో గంజాయి అక్రమ రవాణా చేయలేమని భావించి, 25 కేజీలు గంజాయిని రూ.1 లక్షా 25 వేలు కి కొని, దారి ఖర్చులకు పోను మిగిలిన రూ.11,06,000/- నగదు
ను ఎవరికి అనుమానం రాకుండా బ్యాగ్ లో పెట్టి కారు యొక్క ఇంజన్ భాగం పైన బోనెట్ కిందన అమర్చి, గంజాయిని కారు వెనక డిక్కీ లో అడుగున అమర్చి తరలిస్తుండగా రొంపుల ఘాటి నుండి అయితే చెకింగ్ లు తక్కువ ఉండవచ్చని భావించి రాజమండ్రి వైపు వెళ్తుండగా కేడీపేట, అల్లూరి సీతారామరాజు పార్క్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా పోలీసు వారికి పట్టుబడినారు. వారిపై కేడీపేట పోలీస్ లు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.
ఈ వాహన తనిఖీలలో కేడీ పేట ఎస్సై వై.తారకేశ్వర రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశంసా పత్రాలు అందుకున్న పోలీస్ అధికారులు ఎస్సై కే.డీ. పేట వై.తారకేశ్వరరావు, సిబ్బంది కె.విశ్వేశ్వరరావు, కె.ఆంజనేయులు, ఎ.వి.వి.అప్పారావు, కె.చిరంజీవి, ఏ.వి.సతీష్, పి.గోవిందరావు, కె.జి.నాయుడు.
జిల్లా పోలీస్ కార్యాలయం,
అనకాపల్లి.